1. जीर्णच्छत्रम् इति पाठ्यभागस्य सारांशं सङ्क्षेपेण लिखत।
अथवा
2. जीर्णच्छत्रकारणेन विजयसिंहस्य कीर्तिः कथं व्याप्ताः?
कविपरिचयः - जीर्णच्छत्रम् इति पाठ्यभागः म.म पुल्लेल श्रीरामचन्देण विरचित श्रीरामचन्द्रलघुकाव्यसङ्ग्रहः इति ग्रन्थात् स्वीकृतः।
కవిపరిచయము - జీర్ణచ్ఛత్రమ్ అను పాఠ్యభాగము నుండి మ. మ. పుల్లేల శ్రీరామచంద్రునిచేత రచించబడిన శ్రీరామచంద్రలఘుకావ్యసంగ్రహం అను గ్రంధం నుండి స్వీకరించబడినది.
पाठ्यभागसारांशः - విజయసింహుని యొక్క తండ్రి అయిన ధనసింహుడు ఎన్నో సాహసమైన కార్యాలు చేసి చివరికి యుద్ధంనందు మరణించేను. ఆ కారణంచేత తల్లి విజయసింహున్ని భయంతో పెంచెను. తన తల్లిదండ్రుల ప్రేమకు చిహ్నమైన గొడుగుని బాగుచేయించడానికి నగరానికి వెళ్ళి అశక్తుడై రైలులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వచ్చిన దొంగలను చూసి భయపడినవాడై రైలు గొలుసు లాగి రైలు ఆపగా రక్షకభటులు వచ్చి దొంగలను పట్టుకొనెను. అక్కడ ఉన్న వృద్ధుడుని, అతని కుమార్తెను రక్షించెను. విజయసింహుని పరాక్రమము చేత సంతోషపడిన వృద్ధుడు కొన్ని నెలల తరువాత విజయసింహుని ఇంటికి వెళ్ళి అతనికి ఉద్యోగాన్ని మరియు తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించెను.
प्रस्तुतकथा - వెయ్యి రంధ్రములు కలిగిన గొడుగులో నుండి పడుతున్న సూర్యకిరణాలను చూస్తు ఇది నా దరద్రమును పోగొట్టుటకు కారణమయ్యెను.
इदं गतं दण्डदरिद्रभावम्।
విజయసింహుడు మనస్సులో నవ్వుకుంటూ తన దగ్గర ఉన్న గొడుగులను వారానికి ఒక్కసారైనా సరిచేసుకుంటూ ఆ గొడుగులను చూసి మధురమైన స్మృతులను తలచుకొనెవాడు.
धनसिंहस्य वृत्तान्तः - విజయసింహుని తండ్రి ధనసింహుడు సాహసప్రియుడు, అసహాయ శూరుడు. ఒక తగలబడుతున్న ఇంటినుండి వృద్ధురాలిని, పడవ నుండి పడిన మరొక వృద్ధురాలిని కాపాడెను. చివరికి సైన్యములో చేరి ఇటువంటి సాహసములైన కార్యాలు చేస్తుండెను. కాని ఒకసారి ఆటవీకులు పాత కక్ష్యల వలన బలవంతంగా తీసుకొని వెళ్ళి బలిపశువు వలె చంపెను. ధనసింహుడు చనిపోయినప్పుడు విజయసింహుని వయస్సు ఐదు సంవత్సరాలు. అప్పటినుండి ధనసింహుని భార్య ప్రభుత్వమిచ్చిన కొద్దిపాటి ధనముతోనే కాలము గడిపెను. ఈ పరిస్థితికి భర్త యొక్క ధైర్యసాహసములే కారణము అని నమ్మడంచేత భార్య అప్పటినుండి విజయసింహునికి వంశానికి విరుద్ధమైన భయాన్ని ఉపచేశిస్తూ పెంచెను. ఏ పని చేసినా భయమే. అందరిలో తిరగాలన్న భయమే. యవ్వనంలోకి వచ్చినా లోకజ్ఞానహీనుడు అయ్యెను. ధనసింహుని గురించి తెలిసిన గ్రామస్తులు అయ్యో! బ్రహ్మ సృష్టి ఎంతటి విచిత్రము.
अहो! विधतुर्विधानवैपरीत्यम्।
అంతటి లోకోత్తర మహనీయుడికి ఇంతటి పిరికివాడు ఎలా జన్మించాడని నిందిస్తుండెను. తల్లి కూడా ఆ మాటలకు పశ్చాత్తాప పడుతుండేను. దరిద్రంతో రోజులు గడవలేని స్థితిని చూసి కుమారుని వివాహము అసంభవమని భావించెను. విజయసింహుని యొక్క ఇంట్లో రెండు, మూడు పాత్రలు, విరిగిన పెట్టె, చినిగిన గొడుగు ఇవి మాత్రమే తండ్రి నుండి లభించిన ధనము. ఆ గొడుగు కొన్నరోజున తల్లిదండ్రుల వివాహము నిశ్చయం జరగటంతో వారికి ఇష్టమై ఉండవచ్చు. ఒకరోజు ఆ చినిగిన గొడుగుతో ప్రయోజనమేమి? దీనిని భయట పడేస్తాను అని పలికెను.
किमनेन जीर्णच्छत्रेण प्रयोजनम्
धूमशकटे विजयसिंहः - విజయసింహునికి ఒక రూపాయి మరియు దారి ఖర్చులకు కొంత డబ్బిచ్చి బాగుచేయించమని నగరానికి పంపెను. విజయసింహునికి ఇష్టము లేకపోయినా తల్లి కోరిక మేరకు ఒక పొడవాటి తుపాకీ సంచి వంటి దానిలో పెట్టుకొని నగరానికి వెళ్లి ఎంత ప్రయత్నించినా రూపాయికి బాగుచేయించలేక విసుగుతో రైలు ఎక్కి ఇంటికి బయలుదేరెను. తిరిగి తిరిగి అలసిపోవడం చేత బెర్తు పైకి నిద్రించెను. ఆ భోగిలో విజయసింహుడు, ఒక ధనవంతుడైన ముసలివాడు మరియు బాగా బంగారు ఆభరణాలు ధరించిన అతని కుమార్తె మాత్రమే ఉన్నారు.
రైలు కొంచెం ముందుకు కదలగానే హఠాత్తుగా ముగ్గురు దొంగలు ముసలివాడు అతని కుమార్తె దగ్గరకు వచ్చి కత్తిని చూపించి బెదిరించి నగలను ఇవ్వమనెను. నిద్రనుంచి మేల్కొనిన విజయసింహుడు భయంతో దగ్గరలో ఉన్న రైలు ఆపే గొలుసును పట్టుకొని దిగి తలుపు దగ్గరికి పరిగెత్తెను. ఊహించకుండా తుపాకీ సంచితో వ్యక్తి కనపడటంతో భయపడిన దొంగలు అంతలో రైలు కూడా ఆగడంతో అక్కడి నుంచి పరిగెత్తెను. ఇంతలో భోగీలను పరిశీలిస్తూ గొలుసు లాగిందెవరు అని గేటు దగ్గర ఉన్న విజయసింహుడుని పోలీసులు ప్రశ్నించెను. భయపడిన విజయసింహుడు నేను లాగలేదు అని సమాధానమిచ్చెను.
न मया आकृष्टा
ఈ లోపే ప్రక్కనే ఉన్న వృద్ధుడు మాప్రాణదాత ఇతనే అని జరిగిన విషయం చెప్పడంతో మౌనంగా ఉండిపోయెను. అక్కడి నుంచి దొంగలు పారిపోయేలోపే పోలీసులు పట్టుకున్నారు. వారిలో ఎప్పటినుండో పోలీసులకు దొరకకుండా తిరుగరతున్న దొంగలనాయకుడు విజయసింహుని వల్ల దొరకడంతో అక్కడి వారందరూ విజయసింహున్ని ప్రశంసించిరి. కృతజ్ఞతతో వృద్ధుడు విజయసింహుడిని మాఇంటికి వచ్చి ఆతిథ్యమును స్వీకరించమని కోరినా అతను తిరస్కరించెను. వృద్ధుడు విజయసింహుని ఊరు, చిరినామ కనుక్కొనెను. అప్పటివరకు అనుభవించిన లోకనిందలు మోసిన అతడిని ప్రజలు గౌరవంగా చూడటంతో అతనిలో మార్పు మొదలయ్యెను. అప్పటివరకు వారి వంశానికి ఉన్న సహజధైర్యగుణాలు మేల్కొనెను. దానిని విజయసింహుడు పునర్జన్మగా భావించెను. పరోపకారం, స్వార్థం లేకుండా పని చేయడం వంటి కార్యాల వలన గౌరవం దక్కుతుందని భావించెను. అతనిలో వచ్చిన మార్పు తల్లికి, గ్రామంలోని ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించెను. వృద్ధుడు రెండు నెలల తర్వాత విజయసింహుని ఇంటికి వచ్చి అతని ధైర్యసాహసాలను వర్ణించి అతనికి తన చక్కెర ఫ్యాక్టరీలో ఉద్యోగమిచ్చెను. విజయసింహుడు శ్రద్ధగా పని చేయడంతో కొన్ని నెలల తర్వాత విజయసింహునికి తన కుమార్తెని ఇచ్చి వివాహం జరిపించెను. దొంగల నాయకుడిని పోలీసులు పట్టుకోవడంలో విజయసింహుడు కీలకపాత్ర పోషించడంతో అతనికి రాజబహుద్దూర్ అనే బిరుదుతో గౌరవించెను.
कालान्तरे राजबहुद्दूर इत्युपाधिना सम्भावयामास।
उपसंहारः - ఈ ఐశ్వరానికి, ప్రభుత్వ పురస్కారానికి ఈ పాత గొడుగే కారణము. అందుకే ఆ గొడుగును ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. గొడుగంటె ఇష్టమైన వాళ్ళ అమ్మను గౌరవంగా చూసుకుంటూ ఉండెను. మానవునిలోని స్వాభావిక గుణాలు ఏదో ఒక ఘటన ద్వారా గాలితో నిండిన బంతి వలె ఎగిసిపడతాయి.
No comments:
Post a Comment