Breaking

Tuesday, September 29, 2020

నిజాయితీగా ఉంటే ఎలా ఉంటుంది?

 

 

       మనం ఉద్యోగం లేదా  వ్యాపార రీత్యా ఒకే చోట ఎక్కువ కాలం పని చేయాల్సివస్తుంది అటువంటి సమయంలో  మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అయితే మనస్పర్ధలు రాకుండా ఉండేలా ప్రయత్నించాలి. ఒకవేళ వస్తే వాటిని అక్కడే ఆపేయాలి నీవు చెడు అయినా ఆ ఒక్కరోజుతో ఆ గొడవ ఆగిపోతుంది. లేదంటే ఒకేచోట ఉన్నప్పుడు మనస్పర్ధలు ఎక్కువయ్యి మనసుని గాయపరుస్తాయి అటు ఉద్యోగరీత్యా ఇటు కుటుంబ రీత్యా ఇబ్బంది పడతారు కాబట్టి నిజాయితీగా ఉంటే ఎలా ఉంటుంది అనటానికి ఒక చిన్న ఉదాహరణ.
                      ఒకరోజు కృష్ణ(12సం!!) ఏడుస్తూ తన ఇంటికి వచ్చాడు. అది చూసి తల్లి కంగారుపడుతూ ఏమైంది నాన్న ఎవరైనా కొట్టారా, ఎక్కడైనా పడ్డావా అని అడిగింది. దానికి సమాధానంగా ఆ పిల్లవాడు లేదమ్మా, నన్నెవరూ కొట్టలేదు అలాగని కింద పడలేేదు అని చెప్పాడు. దానికి మరి ఏం జరిగింది అసలు ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించింది.
            దానికి సమాధానంగా ఈరోజు గోపి(13) మన ఇంటికి ఆడుకోడానికి వచ్చాడు కదా తను మనిద్దరం యాపిల్ కాయలు దొంగతనానికి వెళ్దాం దొంగిలించిన వాటిని సమానంగా పంచుకుందామని చెప్పాడు. సరే అని నేను కూడా తనతోపాటు దొంగతనానికి వెళ్లాను. దొంగిలించిన వాటిని సమానంగా పంచుకున్నాం. గోపి తన కాయలు తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు. నేను ఇంటికి వస్తూ ఉండగా ఒక పెద్దాయన నాదగ్గర ఉన్న కాయలను  తీసుకున్నాడు నాకు చాలా బాధ కలిగింది. ఏడుపు కూడా వచ్చింది.     
          అమ్మా! నేను దొంగతనం చేసినప్పుడు ఆనందం కలిగింది అదే వస్తువుని నా దగ్గర నుండి వేరేవాళ్లు లాక్కుంటే బాధ వేసింది. నేను ఎవరి దగ్గర అయితే దొంగతనం చేశానో వారు నా కన్నా ఎక్కువ బాధ పడి ఉంటారు ఎందుకంటే కష్టపడి పెంచుకున్న తోట అందులోనూ డబ్బులు చేతికి వచ్చే సమయానికి నేను దొంగిలించాను  తలుచుకుంటేనే చాలా ఏడుపొస్తుంది వాళ్ల దగ్గరికి వెళ్లి చెబుదామంటే భయం కూడా వేస్తోంది అని చెప్పాడు.
      కొడుకు బాధను గుర్తించిన తల్లి తన కొడుకుతో తెలిసీ తెలియని తప్పులు చిన్న వయసులో పిల్లలు చేయడం సహజం కానీ నీవు చేసింది తప్పు అని తెలుసుకున్నావు. తోట యజమాని దగ్గరికి వెళ్లి నేను మాట్లాడుతాను ఇంకెప్పుడూ తప్పు చేయకు. మన వస్తువు మనకు ఎంత విలువైందో అదేవిధంగా ఎవరి వస్తువులు వారికి అంతే విలువైనవి. ఆ విషయాన్ని గుర్తిస్తే ఎవరు ఎలాంటి తప్పులు చెయ్యరు ఎలాంటి తప్పులు జరగవు.
                  చిన్నతప్పు అయితే సరిదిద్దుకోవచ్చు కానీ సరిదిద్దుకోలేనటువంటివైతే జీవితాంతం బాధ మిగులుతుంది.
                        కృష్ణ తన తప్పును నిజాయితీగా తల్లితో చెప్పకపోయినా, తన తల్లి ఆ కుమారుడు చేసిన తప్పును సమర్థించినా తర్వాత జరగబోయే   అనర్థాలను మనం ఊహించలేము. చిన్నపిలలు తెలిసి తెలియక చిన్న వయసులో చేసిన అల్లరి పనులు కొంతమందికి అలవాటుగా మారి పోతాయి. కాబట్టి వాటిని మనం ఎప్పటికప్పుడు తెలుసుకొని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ఇటువంటి వాటిని పెద్ద వారికి ఒక ఉదాహరణ చెప్పవచ్చు. 
              రాము ఉపాధ్యాయునిగా ఒక చిన్న పాఠశాల లో పని చేస్తూ ఉంటాడు. అతను ఎప్పుడు సమయానికి వస్తూ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటాడు. అందరిని కలుపుకుని వెళ్లే మనస్తత్వం కలిగినవాడు. అయితే ఒకరోజు ఒకే డిపార్ట్మెంట్ కు చెందిన సీనియర్ కిరణ్ అనే ఉపాధ్యాయుడు రాముని మిగతా ఉపాధ్యాయుల అందరిముందు చులకనగా మాట్లాడటం తో కోపాన్ని కూడా మింగి నవ్వుతూ మాట్లాడతాడు. ఆ విషయాన్ని విన్న విద్యార్థి పాఠశాల అయిపోయాక రాముని కలిసి కిరణ్ ఉపాధ్యాయుడు తరగతి గదిలో పిల్లలకు పాఠాలను చెప్పవలసిన విధంగా చెప్పకుండా కుదిస్తూ తరగతి గదిలో మాటలను పెడుతున్నాడని, ఎవరైనా సందేహాలు వచ్చినప్పుడు అడిగితే వాటిని వివరించ లేక కోపాన్ని ప్రదర్శిస్తూ  విద్యార్థులను భయపెడుతున్నారు అని వివరిస్తాడు.
                          ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఈసారి ఎప్పుడైనా కదిలిస్తే ప్రస్తావించాలి అని నిర్ణయించుకున్నాడు. అయితే ఏదైనా కోపంతో కాదని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రాము గురించి మరొక వ్యక్తి దగ్గర చులకనగా మాట్లాడటం తో ఆ వ్యక్తి రాముకు చెప్పడం వలన మంచిగా దగ్గరికి వెళ్లి నా గురించి ఎవరి వద్ద భావించ వద్దని చెప్పాడు. కానీ మేనేజ్మెంట్ దగ్గర రాము చెడుగా చెప్పడంతో రాముని పిలిపించి మేనేజ్మెంట్ మందలిస్తుంది. దానితో ఉద్యోగాన్ని మానేస్తాడు. వేరే ఉపాధ్యాయుడు వచ్చిన విద్యార్థులు మాత్రం మేనేజ్మెంట్తో మాకు రాము సార్ చెప్పిన విధంగా ఆ సబ్జెక్ట్ ను ఇక్కడ ఉన్నవారు కూడా అందులోను సీనియర్ అయిన కిరణ్ సార్ కూడా చెప్పలేరని, రాము సార్ గురించి తరగతి గదిలో చులకనగా మాట్లాడుతున్నారని తెలియజేస్తారు. ఇవన్నీ విని మేనేజ్మెంట్ కూడా తప్పు చేసాము అని భావించి కిరణ్ ని ఉద్యోగం నుంచి తీసి వేసి, రాము ని పిలిపించి క్షమాపణ చెప్పి మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటారు. 
విద్యార్థులందరూ రాము తో జరిగిన విషయం తెలియజేయడంతో దీనంతటికీ కారణం కిరణ్ సార్ కి ఎదుటి వ్యక్తుల మీద ఉన్న చులకన భావం అని నిర్ణయించుకున్నాడు.
నిజాయితీగా ఉంటే కష్టాలు తప్పవు కానీ ఎప్పటికైనా మన కష్టం మంచికి దారి తీస్తుంది. 

1. మిత్రులకి ఒక విన్నపం. క్రింద వచ్చిన కంట గుర్తు నొక్కితే నా బ్లాగు నుండి వచ్చే ఆర్టికల్ కానీ, కథ కానీ నోటిఫికేషన్ల రూపంలో మీకు అందుతుంది.
2. ఈ ఆర్టికల్ కానీ లేదా కథ గాని క్రింద ఉన్న వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులకు పంపవచ్చు.
3. ఈ బ్లాగులోని మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు.