బంధాలు అన్నింట్లోకి గొప్ప బంధం వివాహ బంధం. ఎందుకంటే తెలియనటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చిన స్త్రీ మన రక్తసంబంధాన్ని బలపరుస్తూ, స్నేహ బంధానికి విలువనిస్తూ మన వంశానికి పేరుప్రఖ్యాతులను అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఇద్దరు ముసలి వాళ్లు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తూ వారి కుటుంబ విషయాలు పంచుకుంటూ కొడుకుల గురించి మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఒకరు శ్రీనివాసు (64), మరొకరు కృష్ణ (59).
శ్రీనివాస్ తనకొడుకు "విజయ్ నెల మొత్తం కష్టపడి వచ్చిన జీతం మొత్తం భార్య శాంతి చేతిలో పెడతాడు పిల్లలిద్దరికీ ఏమి కావాలన్నా, నాకు ఏమి కావాలన్నా నా కోడలు తీసుకొస్తుంది. నన్ను నా కోడలు తండ్రి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది ఇంతకంటే నాకేం కావాలి" అని కృష్ణతో చెప్తాడు. ఒక మగవాడు తన జీతం మొత్తం స్త్రీ చేతిలో పెట్టాడు అంటే తను ఆ కుటుంబాన్ని ఎంతగా ఇష్ట పడుతుందో లేదా తన కుటుంబంలోని వారందరిని బాగా చూసుకుంటుంది అనే నమ్మకం ఉంటేనే అలా చేయగలడు. కాబట్టి శాంతి నాకు కోడలుగా దొరకడం అదృష్టం ఇందులో ఎటువంటి సందేహము లేదు అని శ్రీనివాస్ మాటలు విని కృష్ణ ఆశ్చర్యపోతాడు.
అప్పుడు కృష్ణ నా కొడుకు రాజు సహనశీలి కాబట్టి నా కోడలు చందనని భరిస్తున్నాడు. చందన వారి కుటుంబంలో ఒకే ఒక కుమార్తె అందుకని గారాబంగా పెంచడం వలన ఇప్పటికీ తను అనుకున్నది జరిగితీరాలి అంటుంది. తనకి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండడం వలన నా కొడుకుతో విడాకులు తీసుకుని వారి తల్లిదండ్రుల దగ్గరే ఉండాలని కోరుకుంటుంది. వారిరువురి మధ్య గొడవల వలన నాకు, నా కొడుక్కి, నా మనవడికి మనశ్శాంతి కరువైందని కృష్ణ శ్రీనివాస్ కి వివరిస్తాడు.
అలా మాట్లాడుకుంటూ ముందుకు నడుస్తూ ఈకాలంలో తల్లిదండ్రులకు పిల్లల మీద ఉన్న అతిప్రేమ కూడా వారి చెడు ఆలోచనలకు కారణమవుతుంది. నా కోడలు చందన కూడా కోటీశ్వరుల కుమార్తె కావడం వలన తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండటం వలన భర్తకి, కొడుక్కి దూరమవుతుంది అని బాధపడ్డాడు. ఆ మాటలు విని శ్రీనివాసు "(రాజు చందన) ఇద్దరికి వివాహబంధం గురించి తెలియజేసి కలపాలి" అని నిర్ణయించుకున్నాడు.
శ్రీనివాసు కృష్ణ కుటుంబాన్ని ఆదివారం రోజు తనఇంటికి ఆహ్వానిస్తాడు. శాంతి వచ్చిన వారందరికీ భోజనాలు సిద్ధం చేసి అందరికీ ఒకేసారి వడ్డిస్తుంది అందరూ మాట్లాడుకుంటూ భోజనం చేసిన తరువాత శ్రీనివాసు "శాంతి విజయ్ ల పెళ్లి వీడియోలు పెట్టి అప్పటి విషయాలను వర్ణిస్తూ ఉంటాడు. చందన శాంతి గురించి గొప్పగా విని ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే శాంతి నాకన్నా గొప్ప ధనవంతులు కానీ గర్వం లేకుండా సంప్రదాయంగా ఉంది.
చందన శాంతిని చదువుకుని ఇంట్లో ఉండటం నీకు నచ్చిందా అని ప్రశ్నిస్తుంది దానికి శాంతి లక్షలు సంపాదించినా రాని సంతోషం కుటుంబంతో కలుగుతుందని నాకనిపించింది. ఒక స్త్రీకి కుటుంబమే గొప్ప ఆస్తి అని నా అభిప్రాయం అని వివరణ ఇచ్చింది. అంతేకాక చందనకిి మన తల్లిదండ్రులు మనకు బలం కావాలి కానీ బలహీనతకాకూడదు. విడాకుల విషయంలో ఒకసారి ఆలోచించండి అని చెబుతుంది. ఈ మాటలను కృష్ణ వింటాడు.
ఒకరోజు చందన తండ్రి కాంతారావుకు గుండె నొప్పి రావడంతో హాస్పటల్లో జాయిన్ అవుతాడు. కాంతారావుకు కొడుకు లేకపోవడంతో రాజు తన ఉద్యోగానికి సెలవు పెట్టి హాస్పిటల్లో మామ దగ్గరే ఉండి తండ్రిలా చూసుకుంటాడు. అప్పుడు కాంతారావుకి రాజు గురించి అర్థమవుతుంది. ఆ తర్వాత కాంతారావు స్వయంగా చందనను పిలిచి నీభర్తని అర్థం చేసుకోవడంలో నీవు విఫలమయ్యావు. తనకన్నా నీకు మంచి భర్త దొరకడు అని చెప్తాడు.
చందన ఆ క్షణంలో తండ్రి చెప్పిన మాటలను, శాంతి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని జీవితాంతం తోడుగా ఉండేది భర్త, పిల్లలు మాత్రమే అని ఆలోచించి గడిచిన కాలాన్ని ఎలాగైతే తీసుకురాలేమో అదేవిధంగా విడాకులు పొందిన తరువాత మంచి కుటుంబాన్ని పొందటం కూడా కష్టమే అని నిర్ణయించుకుని విడాకులు మానుకొని తన కుటుంబాన్ని సంతోషంగా చూసుకోసాగింది.
తన కుటుంబాన్ని కలపడంలో శ్రీనివాస్ కుటుంబం సహకరించిందని వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాడు కృష్ణ.
పెళ్లిళ్లు భగవంతుడు స్వర్గంలో నిర్ణయిస్తారు అని అంటారు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా "భార్యకి భర్తే బలం, భర్తే ధైర్యం" ఈ విషయం తెలియక ఈకాలంలో ఎక్కువగా చందనలాంటి వాళ్ళు ఉండటం వల్ల తల్లిదండ్రుల దగ్గర ఉన్న ధనాన్ని చూసుకొని విడాకులు పొందుతున్నారు.
1. మిత్రులందరికీ విన్నపం. క్రింద వచ్చే గంటకి గుర్తును నొక్కడం వలన నా బ్లాగ్ నుండి ఇ వచ్చే ఆర్థిక లను లేదా కథను నోటిఫికేషన్ల రూపంలో ముందుగా మీరు పొందవచ్చు.
2. ఈ ఆర్టికల్ లేదా కథని క్రింద ఉన్న వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులకు పంపవచ్చు.
3. ఈ బ్లాగులోని మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
4. ఈ ఆర్టికల్ ను మీ మిత్రులకు వాట్సప్ ద్వారా పంపుతారని ఆశిస్తున్నాను.
2 comments:
Good sir
చాలా బాగుంది.. Dr keshavulu MD.
Chairman:
Telangana intellectuals Association
Post a Comment