లక్ష్యం లేని జీవితం తెగిన గాలిపటం వంటిది. అందుకే లక్ష్యం లేని మనిషి ఈ భూమ్మీద ఉండడు. చిన్నపిల్లలను నీవు ఏమి అవుతావు రా అంటే ఖచ్చితంగా ఆ పిల్లలు ఎక్కువ పోలీసు అనే చెబుతారు. కానీ తరువాత తరువాత పెద్దయ్యే కొద్దీ వారి ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యం అన్ని మారిపోతాయి.
విద్యార్థులకు చదువుతోపాటు, వారికంటూ ప్రత్యేక గుర్తింపును సాధించడానికి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకు డిగ్రీ స్థాయి నుంచి కష్టపడి చదివితే కచ్చితంగా మంచి ఉద్యోగాన్ని, మంచి స్థానాన్ని సంపాదించవచ్చు అని చెప్పడానికి మనకి మన ప్రక్కనే చాలా మంది ఉదాహరణలుగా దొరుకుతారు. కానీ మనం చెప్పము. ఎందుకంటే మనలో ఉన్న అహం అడ్డం వస్తుంది. అలా కష్టపడి చదువుకునే వారిని ప్రోత్సహిస్తే మీస్నేహం ఇంకా బలపడుతుంది.
చదువు మానేసి వ్యవసాయం చేసి పది సంవత్సరాల తరువాత తిరిగి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. తలుచుకుంటే ఎవరైనా లక్ష్యాన్ని సాధించడం సాధ్యమే అని నిరూపించాడు ఒక వ్యక్తి. అతనే నాగార్జున ఈ కథకు మూలకారకుడు.
చెన్నేకొత్తపల్లి మండలంలోని వెంకటంపల్లి గ్రామానికి చెందిన యం. లింగన్న, అంజనమ్మ అనే వ్యవసాయ కుటుంబానికి చెందిన దంపతులకు ఏడుగురు సంతానంలో నాలుగో సంతానంగా జన్మించిన నాగార్జున.
నాగార్జున 10 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లిదండ్రులకు సహాయగా మేకలు కాస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఎనిమిదో తరగతి చదువుతూ మధ్యలోనే చదువు మానేసి, తల్లిదండ్రులకు సహాయంగా ఐదు సంవత్సరాలు వ్యవసాయం చేసి రెండు మూడు సంవత్సరాలు వ్యవసాయంలో నష్టం రావడంతో అక్కడి నుండి కుటుంబంతో సహా బెంగళూరు వెళ్ళారు. అక్కడ తన కుమారుడి వయసు ఉన్న వారందరూ రూ చదువుకోవడం చూసి బాధ పడేవాడు. తల్లిదండ్రులు అక్కడ కూలిపని చేసుకుంటూ ఉండగా నాగార్జున మందులషాపులో ఐదవ సంవత్సరం పనిచేస్తున్న సమయంలో ఒక రోజు రాత్రి వచ్చిన బడిపంతులు సినిమా ఆ వ్యక్తి ఆలోచనను ఆశయాన్ని మార్చేశాయి. చాలామంది సినిమాలు చూసి చెడిపోతారు అంటారు కానీ సినిమా మానవుని జీవితంలో కొత్త ఆలోచనలను, కొత్త ఆశయాలను, మంచి జ్ఞాపకాలను, కొత్త ఉత్సాహాన్ని కూడా ఇవ్వగలదని కొందరి జీవితాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్లీ పదవ తరగతి ని పూర్తి చేయాలనే తాపత్రయంతో ప్రైవేటుగా కట్టి రెండు సార్లు ఫెయిల్ అయ్యి పాస్ అయిన తర్వాత కష్టపడి పని చేసుకుంటూ ఇంటర్ పూర్తి చేసుకొని డైట్ సట్ రాసి సీటు రాకపోవడంతో రెండు సంవత్సరాలు డిగ్రీ చదివి మధ్యలో డిగ్రీ మానేసి 2012లో డైట్ సెట్ ర్యాంక్ తో అనంతపురంలోని పివికేకే కళాశాలలో చదువుతూ తన అక్క నాగరత్నమ్మ ప్రోత్సాహంతో టిటిసి మొదటి సంవత్సరం నుంచే డిఎస్సి కి చదువుతూ 2015లో జరిగిన డీఎస్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా (SGT) 2016 జూన్ ఒకటో తేదీన మడకశిర కు దగ్గరగా ఉన్న ముత్తుకూరు అనే గ్రామంలో తన బాధ్యతను ప్రారంభించాడు.
ప్రతి మనిషికి తనకు నచ్చిన హీరో ని సినిమాలో చూసి నేను కూడా అలా ఉండాలి అని అనుకుంటాడు. అనుకుంటాడు అంతే అది మంచైనా చెడైనా నచ్చిన హీరో అయితే చాలు. కానీ కొంతమంది మాత్రమే సినిమాలను చూసి అందులో మంచి విషయాలను స్వీకరించి వారి జీవితానికి అనువుగా ఆ విషయాలను ఉపయోగించుకుంటారు అదే నిజమైన కార్య సాధకుడి లక్షణం. అటువంటి లక్షణాలు ఉన్న వారు నూటికో కోటికో ఒక్కరు. అటువంటి వారు తప్పక విజయం సాధిస్తాడు.
మనకి తెలిసి మన చుట్టూ ఎంతో మంది కష్టపడి పనిచేస్తూ, చదువుతూ ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించినా ఎదుటి వ్యక్తి గొప్పతనాన్ని మెచ్చుకోవడానికి మనకి అహం అడ్డం వస్తుంది. కానీ ఎవరైనా సరే మనసులో ఒక్కసారైనా ఆ వ్యక్తి గొప్పతనాన్ని ఒప్పుకోక తప్పదు.
ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నప్పుడు దానికి తగినట్లుగా మన సమయాన్ని సుమారు నిద్రకు కేవలం ఆరు గంటలు కేటాయించే మిగతా గంటల సమయాన్ని పుస్తకాలు చదవడానికి, ప్రతి రోజూ పేపరు చదవడానికి కొంత సమయాన్ని ఉపయోగిస్తే మన పనులను మానుకొని శ్రమించాలి అప్పుడే విజయాన్ని సాధిస్తారు.
ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. ఏదో ఒక లక్ష్యం ఉంటుంది కానీ ఆ లక్ష్యానికి నీతిగా, నిజాయితీగా, నిరంతర శ్రమ తోడైతే మీరు విజయం సాధిస్తారు అనడానికి నేనే ఒక ఉదాహరణ. అంటే ఇక్కడ అర్థం ఆలోచన మంచిది అయితే విజయం సాధించడం ఖాయం.
ఇటువంటి కష్టపడి పనులు చేసుకుంటూ ఉద్యోగం సంపాదించిన వారిలో కొందరి పేర్లు మాత్రమే అందులోనూ ఉపాధ్యాయునిగా పని చేసే వారి మాత్రమే 1. అంకమరావు, 2. శ్యామ్ కిరణ్, 3. సుబ్బారావు, 4. నరసింహ వీరందరూ తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారే.
1. మిత్రులకు ఒక విన్నపం. క్రింద వచ్చే గంట గుర్తు నొక్కడం వలన నా బ్లాగ్ నుండి వచ్చే ఆర్టికల్ లేదా కథని ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు.
2. ఈ ఆర్టికల్ ను కింద ఉన్న సోషల్ మీడియా ద్వారా మిత్రులకు పంపవచ్చు.
No comments:
Post a Comment