Breaking

Wednesday, October 21, 2020

ఇల్లాలు ఎలా ఉంటుంది? వారి ఆలోచనలు ఏమిటి?

                    


                            స్త్రీ గురించి, భారతదేశ చరిత్ర గురించి ఎంత చెప్పినా ఏమి చెప్పినా అది తక్కువే. ఎందుకంటే భారతదేశానికి ఎన్నో యుగాల చరిత్ర. ఎన్ని యుగాలు మారినా భారతీయులకు మాత్రమే స్త్రీ  ఓ శక్తి. తరాలు మారినా, యుగాలు మారినా స్త్రీ అంటే ఓర్పు. స్త్రీ వల్ల యుద్ధాలు జరిగాయి, రాజ్యాలు పోయాయి అంటారు. 

              స్త్రీ వల్ల గెలిచిన వారు ఎవరు లేరా ? ఈ క్షణం వరకు ప్రతి మగవాడు ఎదుగుతున్నాడు అంటే అందులో కచ్చితంగా తన తల్లి, చెల్లి లేదా భార్య సహాయం ఖచ్చితంగా ఉండి ఉంటుంది. స్త్రీ ప్రమేయం లేనివారు కూడా ఉండొచ్చు కానీ అటువంటి వారు నూటికి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే కలికాలం కాబట్టి. ఎంత గొప్ప మగాడైనా చిన్న వయసులో తల్లి గోరుముద్దలు, నీతి కథలు, జోల పాటలు లేకుండా పెరిగిన వారు ఎవరైనా ఉన్నారా? చెప్పాను కదా ఒకరు లేక ఇద్దరు ఉంటారు.ఇవన్నీ చెప్పడానికి కారణం ఒక్కటే. స్త్రీని గౌరవించడం కోసం.

               ప్రతి మగవారి లాగా స్త్రీకి కూడా చిన్నప్పటినుంచి ఆశలు, ఆశయాలు ఉంటాయి కానీ వాటిని జయించేది ఇప్పటికీ కొందరే. మరి మిగతా వారందరి ఆశలు, ఆశయాలు పెళ్లయిన తర్వాత అత్తకి సేవలు చేసుకోవడం లేదా భర్తకి వండి పెట్టుకోవడం దీంతోనే జీవితం సరిపోతుంది అంటే వీరు లక్ష్యాన్ని ఛేదించి లేక పోతున్నారా! 

                    చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఇద్దరు అమ్మాయిలు ఒకరు అన్విత, మరొకరు శ్రావ్య చదువులో నువ్వానేనా అన్నట్టుగా పోటాపోటీగా ఎదిగి ఉద్యోగాలలో స్థిరపడి వివాహం జరిగిన తర్వాత అన్విత  భర్త, అత్తమామలు, పిల్లలే ప్రపంచం అనుకోని ఉద్యోగం మానేసి సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంది. కానీ శ్రావ్య వివాహం తర్వాత కూడా ఉద్యోగం చేస్తూ, అత్త మామలకు దూరంగా, కొడుకును చదివించుకుంటూ హైదరాబాదులో ఉంటుంది.

                     ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో ఊర్లో గుడిలో విగ్రహ ప్రతిష్ట ఉండటం వలన చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరూ మిత్రులందరినీ కలుసుకున్నారు. కానీ శ్రావ్యకి కొంచెం అహంకారం కారణం ఇప్పటికీ ఉద్యోగం చేస్తూ అందరి కన్నా గొప్పగా స్థిరపడ్డానని, అన్వితతో ఉద్యోగం చేసి ఉంటే నాలాగా కార్లలో తిరుగుతూ ఉండే దానివి అని అనడంతో ధనం సంపాదించడానికి వయసు చాలా ఉంది. కానీ పిల్లలను చదివించడానికి, మంచి నడవడిక నేర్పించడానికి, అత్తమామలకు చేదోడుగా ఉండడానికి ఇది సరైన సమయం అని అన్విత చెబుతోంది.

                   ఆ మాటలు విన్న తర్వాత శ్రావ్య  "ఓడిపోయిన వారు మాత్రమే సూక్తులు పలుకుతారని" మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. భర్త కలకత్తా లో ఉద్యోగం చేస్తున్నాడు, కొడుకు హాస్టల్లో ఉండి బాగా చదువుకుంటున్నాడు. ఇదంతా డబ్బు ఉండబట్టే కదా! ఇంతకన్నా ఏం కావాలి? అని అనుకుంటుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఒకరోజు శ్రావ్యకి ఆరోగ్యం బాగోలేక ఇంట్లో ఉండడంతో చూసుకునేవారు, చేసిపెట్టేవారు లేకపోవడంతో, తన వారు పక్కనే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.  తన భర్తకు ఫోన్ చేస్తుంది భర్త ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో,  అన్విత మాటలు గుర్తు వచ్చినా తనను తాను తక్కువ చేసుకోలేక తనని తాను కరెక్ట్ అని నిర్ణయించుకుంటూ కొన్ని సంవత్సరాలు గడిపేసింది.

                        పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగారు భర్త మరణించిన తర్వాత శ్రావ్య కొడుకుతో ఉంటూ ఉద్యోగం మానేసింది. వయస్సు పెరగడంతో అనారోగ్య సమస్యలు ఎదురైనా కొడుకు ప్రేమగా తనే స్వయంగా దగ్గర ఉండి ధనం కన్నా కూడా తల్లికి ప్రాధాన్యత ఇవ్వడం చూసి  తన కుమారుడితో నీ చిన్నప్పుడు నేను ఉద్యోగ రీత్యా దూరంగా ఉండి నిన్ను పట్టించుకోలేకపోయాను, అత్తమామలను చూడలేక పోయాను. కానీ ఇప్పుడు నీవు నన్ను చూసుకోవడాన్ని చూసి నాకే సిగ్గేస్తుంది. దానికి కొడుకు నా చిన్నప్పుడు మన ఊర్లోనే విగ్రహ ప్రతిష్టకు వెళ్ళినప్పుడు అన్విత ఆంటీ మాట్లాడిన మాటలు నేను విన్నాను. కానీ పరిస్థితుల ప్రభావం నన్ను దూరంగా పెట్టి ఉండొచ్చు కానీ అటువంటి పరిస్థితి నేను  మీకయినా, నా పిల్లలకైనా తీసుకురాకూడదని నేను ఆరోజే నిర్ణయించుకున్నాను. ఆ మాటలు విని శ్రావ్య అన్వితకు క్షమాపణ మరియు ధన్యవాదాలు కూడా తెలపాలి అనుకుంటుంది.

                     అన్విత కొడుకు వివాహం సందర్భంగా శ్రావ్యను పిలవడానికి ఇంటికి వెళ్ళినప్పుడు శ్రావ్య అన్వితతో నీ యొక్క మాటల ప్రభావం నా కుమారున్ని మంచి దార్లో నడిపించాయి. అన్విత అది ఎలా? అని ప్రశ్నిస్తే జరిగిన విషయాన్ని తెలియజేస్తుంది. దానికి అన్విత కూడా సంతోషించి పెళ్లికి కొడుకుతో సహా రమ్మని ఆహ్వానిస్తుంది.

            పెళ్లికి వెళ్ళినప్పుడు శ్రావ్య కొడుకు బంధువులను, తెలిసినజనాలందరిని పలకరిస్తూ, అందరితో కలిసి పోవడం చూసి తన కుమారుడు ఇంత ఆనందంగా ఇప్పటివరకు లేడని అన్విత చెప్పిన మాటలు నిజమే మనం మన పిల్లలకు చిన్నప్పటినుంచి  మంచి నడవడిక, కలగొలుపుతనం నేర్పించగలిగితే వారే బాధ్యతలు తెలుసుకొని జీవితంలో స్థిరపడతారు అంతకన్నా ఆస్తులు ఎందుకు వారికి అనే నిర్ణయానికి వస్తుంది శ్రావ్య. ఇంతటి ఆనందాన్ని ఇప్పటివరకు కోల్పోయాను కానీ చివరగా నాకొడుకు చెబితే అన్విత గొప్పతనాన్ని తెలుసుకున్నాను అని బాధపడుతుంది. మరోపక్క ఇప్పటికైనా తెలుసుకోగలిగాను సంతోషపడుతుంది.

                   అంతటి పెళ్లిపందిరిలో ఎంతోమంది జనాల మధ్య కూడా శ్రావ్యకొడుకు ధనమున్న, నిరాడంబరంగా అహంకారం లేకుండా జనాలతో కలిసిపోవడంతో పల్లెటూర్లో ఆడపిల్లల దిష్టి తగిలేలా ఉంది. అంతటి పెళ్లి హడావిడిలో కూడా అన్విత, అన్విత భర్త అతిథిగా వచ్చిన శ్రావ్య కొడుకుని తన అల్లుడిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికి కారణం అతని పెదవులపై చిరునవ్వు, మంచితనం మాత్రమే. ఇదంతా విని తను కోల్పోయిన సంతోషాలను తిరిగి తన కొడుకు ద్వారా పొందుతున్నట్లు ఆనందపడి ఆఊర్లోనే అన్విత కుటుంబానికి దగ్గరగా ఉండాలని నిర్ణయించుకుంది. 

                   ఈ కథలో అన్విత బాగా చదువుకుని కూడా పెళ్లి తర్వాత తన కుటుంబం ముఖ్యమనుకుంది. కానీ శ్రావ్య ధనం ముఖ్యం అనుకుంది ఇద్దరు విజయం సాధించారు  ఒకరు ఉద్యోగం త్యాగం చేస్తే, మరొకరు సంతోషాన్ని పోగొట్టుకున్నారు. ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని సంతోషంగా చూసుకునే వారు కూడా ఉన్నారు. నేను కొంతమంది అహంకారం, గొప్పలు, గొప్పతనాలకు పోయి సంతోషాన్ని దూరం చేసుకుంటున్నారు. ఏదేమైనా తల్లి మాత్రమే తన పిల్లలకు మంచీచెడు తెలియజేస్తూ పెంచగలదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం ఇది మాత్రమే నిజం.



6 comments:

Unknown said...

Meeru super sir always super sir

Unknown said...

Your YouTube channel I'm watching sir videos sir always y r great sir

Unknown said...

Ravi sir good msg pettadam telidu anduke late reply sir

RK (RAVIKANTHA REDDY) said...

Tq, no problem

RK (RAVIKANTHA REDDY) said...

Thanks to all

Siri said...

Nice..